ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది. కొన్ని వారాలలో ఫలితాలు తెలుస్తాయి. ప్రభుత్వం మారవచ్చు, మారకపోవచ్చు.
ఒకటి మాత్రం మారదు. సామాన్య జీవుడి పట్ల ఉదాసీనత. అటు రాజకీయలకి చెందిన వారు కానీ, ఇటు మీడియాకి చెందిన వారు కానీ, ప్రజలు అంటే కేవలం ఆట బొమ్మలుగా భావించి ఒకరిపైన ఒకరు సాగిస్తున్న ప్రాపగండా యుద్ధాలు ఇంకొకడుగు ముందుకు వేస్తాయి. ఇంకెక్కడి రాజకీయం, మీడియా. ఇప్పుడు రెంటిని వేరు చేసి మాట్లాడితే పాపం. ఆ రెంటికి మధ్య ఏ విధమయిన అంతరాలు లేకుండా కలిసిపోయాయి. చీలికలు మాత్రం సమాజంలో వీరి ఆగడాల వలన ప్రజల మధ్య ఏర్పడ్డాయి.
ఎన్నికల సమయమ్లో ఒక పక్షం వారు ఊపిరి పీల్చినా తప్పేనన్నట్టుగా రాసినవారు ఇన్నాళ్ళు కానరాకుండా పోయిన విచక్షణను ఒక్కసారిగా వలకపోయడం మొదలుపెట్టారు. మరొక వర్గం ఇంకా ఆ పాత ధోరణిలోనే ఉన్నట్లుంది. వీరి మాటలను విని వైరి వర్గాలుగా మారి, వాదనలు చేసుకున్న ప్రజలు మాత్రం ఆ ధోరణుల నుండి బయట పడడం కష్టం. వీరాంత కలిసి నూరిపోసిన విషం ప్రభావం అంతటిది మరీ.
ప్రభుత్వం వద్ద నుండి సమాచారం రాబట్టడానికైతే మనకు సమాచార చట్టం ఉంది, కానీ మీడియా చేత భాధ్యతాయుతమయిన రిపోర్టింగ్ చేయించడానికి మన వద్ద ఏ శక్తీ లేదు. నిలదీయదానికీ ఏ చత్తమూ సహకరించదు.
ఇక్కడ కూడా మనం losers. It really does take a lot to live in such a vibrant democracy. We got to keep with a lot of crap around and end up being a bunch of perennial losers. But never say die. I see light at the end of the tunnel. I can wait until I get there. When I don't see the light coming my way I am going to get down to get it myself.
Until then I'll spare you of anymore crap from me.
0 comments:
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.