చంద్రబాబు ఫ్లాపు అయ్యాడు. చిరంజీవి అత్తరు ఫ్లాపు అయ్యాడు. కే సి ఆర్ మరియు వామ పక్షాలు అస్సలు పుట్టగతులు లేకుండా పోయాయి అనే మాటలను కాసేపు పక్కన పెడితే...
అది పక్కన పెడితే ఎప్పుడో పెట్టిన పక్షాలు అయిన తెరాసా, వామ పక్షాలు చంద్రబాబు ఏదో భీబత్సంగా గెలుస్తాడు, మనందరికీ 'దోచి పెడతాడు' అని చంకలు బాదుకుంటూ వెళ్లి ఆయన ఒళ్లో కూర్చున్నారు. చిరంజీవి మాతో కలవండి బాబులు అని ఎంత మొత్తుకున్నా అస్సలు పట్టించుకోలేదు పాపం అతన్ని. అంతా అయిపోయాకా మాత్రం వెధవలు అయ్యారు. చిరంజీవి కాస్తో కూస్తో పరువు కాపాడుకున్నాడు.
ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఈ క్రింది అంకెలు చూస్తే చిరంజీవి చాల బాగా వోట్లు సంపాదించాడు అనే చెప్పాలి. పదహారు శాతం దగ్గర ఆగిపోవడం నిజంగా ఇటు కాంగ్రెస్ కి అటు తెదేపా కి చాల మంచిదయింది. ఇంకొక్క శాతం ఎక్కువ వోట్లు సంపాదించి ఉంటె ప్రధాన పార్టీల తలరాతలు తారుమారు అయ్యేవి. క్లుప్తంగా చెప్పాలంటే తెరాసా కన్నా నాలుగింతలు వోట్లు సంపాదించాడు. అదేమీ మామూలు విషయం కాదు.

ఇకనయినా ఉన్న రెండు ప్రధాన పార్టీలకు తొత్తులుగా (అదీ వంతులు వారీగా) ఉండడం మానేసి జనంలోకి వెళ్లి బుద్దితెచ్చుకున్ట్టారో లేదో మరి తెరాసా, వామపక్షాలు.
image source: eenadu
1 comments:
అట్టర్ ఫ్లాప్ చంద్రబాబు లాంటి వరల్డ్ బ్యాంక్ తోలు బొమ్మలకి ఎదురవ్వాలి. ప్రజారాజ్యం పార్టీకి శ్రీకాకుళం జిల్లాలో చాలా గ్రామాలలో కార్యకర్తలు లేరు. అందుకే ఆ పార్టీ శ్రీకాకుళం జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవలేదు. తెలుగు దేశం పార్టీకి ఈ జిల్లాలో కార్యకర్తలు ఎక్కువగా ఉన్నా ఈ జిల్లాలోని పది సీట్లలో ఒక్క సీటు మాత్రమే దక్కింది. తెలుగు దేశం లాంటి పారాసైటిక్ పార్టీలకి ఇలాంటి గతే పట్టాలి.
Post a Comment
Please leave your comments here.
Comments will be published after moderation. Read my Comments Policy . (updated..)
Thank You.